కరోనా రికవరీల్లో భారత్ దే అగ్రస్థానం

కరోనా రికవరీల్లో భారత్ దే అగ్రస్థానం

దేశంలో కరోనా కరోనా  వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు దాదాపు 95 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,961  కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 54,87,581 కి చేరింది. మరో 1130 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య మొత్తం 87,882 కు చేరింది. దేశంలో నిన్నటి వరకు కరోనా నుంచి 43,96,399 మంది కోులుకున్నారు. ఇంకా 10,03,299 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 79.68 ఉండగా మరణాల రేటు 1.61 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అంతేగాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటులో అత్యధిక శాతం భారత్ లోనే ఉందని తెలిపింది.  భారత్ లో  43 లక్షల 96 వేల మంది  కోలుకున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా రికవరీ రేటులో 19 శాతం. అమెరికాలో 42 లక్షల మంది కోలుకున్నారు. ఇది ప్రపంచ రికవరీ రేటులో 18.70 శాతంగా ఉందని తెలిపింది.