టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

శ్రీలంకతో నేటి నుంచి జరిగే రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా ఇండియా మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇద్దరు సీనియర్ ప్లేయర్లకు ఎంతో కీలకం కానుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి వందో మ్యాచ్​కాగా.. టెస్టు కెప్టెన్‌‌గా ఎంపికైన రోహిత్‌‌కు తొలి పోరు. బలహీనంగా ఉన్న లంకను ఓడించి ఈ మ్యాచ్‌‌ను మధురజ్ఞాపకంగా మార్చుకోవాలని ఈ ఇద్దరితో పాటు ఇండియా మొత్తం ఆశిస్తోంది. టీ20ల్లో వైట్‌‌వాష్‌‌ అయిన లంక నుంచి పెద్దగా పోరాటాన్ని ఆశించలేం. రోహిత్‌‌సేన జోరు చూపిస్తే మ్యాచ్‌‌ ఐదు రోజుల వరకూ కూడా వెళ్లకపోవచ్చు. ఈ మ్యాచ్‌‌లో ఫోకస్‌‌ మొత్తం  కోహ్లీ,  రోహిత్‌‌పైనే ఉంది. కాగా.. విరాట్ వందో మ్యాచ్ కు ఆయన సతీమణి అనుష్క శర్మ కూడా స్టేడియం నుంచి వీక్షించనుంది.

రోహిత్‌‌ (కెప్టెన్‌‌), మయాంక్‌‌, హనుమ విహారీ, కోహ్లీ, పంత్‌‌ (కీపర్‌‌), శ్రేయస్‌‌, జడేజా, అశ్విన్‌‌, షమీ, బుమ్రా, జయంత్‌‌ లతో టీం గ్రౌండులోకి దిగింది.