కొత్తగా 12,249 కరోనా కేసులు

కొత్తగా 12,249 కరోనా కేసులు

నిన్న తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,249 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 4,33,31,645కి చేరుకుంది. అటు కరోనాతో మరో 13 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 5,24,903 కు చేరుకుంది. కరోనా నుండి 9,862 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 81,687 యాక్టీవ్ కేసులున్నాయి.  కొత్త వచ్చిన కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర(3,659), కేరళ(2,609) నుంచే వచ్చాయి. ఇక డిల్లీలో  వెయ్యికి పైగా కొత్త కేసులు రాగా.. కర్ణాటక, తమిళనాడు, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.