బీ అలర్ట్... మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

బీ అలర్ట్... మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లోనే 3,720 కొత్త కరోనా కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 40,177కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కొవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 5,31,584కు చేరిందని ప్రకటించింది.

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లకు (4,49,56,716) చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.73 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,43,84,955 కు చేరింది. దీంతో కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద భారతదేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు అందించారు.