దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 656  మంది  వైరస్ బారిన పడ్డారు. ఒకరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3, 742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలో ఒకరు మృతి చెందారని చెప్పింది. దీంతో మరణించిన వారి సంఖ్య 5,33,333కు చేరుకుంది. దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.5 కోట్లుగా నమోదైంది. వైరస్ బారిన పడ్డ వారిలో 4,44,71,545 కోట్ల మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడి కోలుకున్న వారి శాతం 98.81 గా నమోదైంది.