భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రెండువేల లోపే నమోదు అవుతూ వస్తోంది తాజాగా దేశవ్యాప్తంగా 1,581 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 33 మంది మరణించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23,913 కరోనా పాజిటివ్  కేసులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా జరుగుతోంది. దేశంలో అర్హులైన వారందరికీ.. కరోనా టీకా కూడా ఉచితంగా అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా 12 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు.ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,81,56,01,944మందికి కోవిడ్ వ్యాక్సిన్ పూర్తయ్యింది.