దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,313 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,44,958కి చేరుకుంది. మరో 32 మంది కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 5,24,941కు చేరుకుంది. అటు గడిచిన 24 గంటల్లో 10,972 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 83,990 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో 0.19 కేసులు యాక్టివ్గా ఉండగా, రికవరీ రేటు 98.60, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
#COVID19 | India reports 13,313 fresh cases, 10,972 recoveries and 38 deaths in the last 24 hours.
— ANI (@ANI) June 23, 2022
Active cases 83,990
Daily positivity rate 2.03% pic.twitter.com/u8Q2WhlI3w