కొత్తగా 13,313 కరోనా కేసులు

కొత్తగా 13,313  కరోనా కేసులు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.  గడిచిన 24  గంటల్లో కొత్తగా 13,313 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,44,958కి చేరుకుంది. మరో 32 మంది కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 5,24,941కు చేరుకుంది. అటు గడిచిన 24  గంటల్లో 10,972 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 83,990 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో 0.19 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.60, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.