ఒకే రోజు 904 మంది మృతి..1,68,912 కేసులు

ఒకే రోజు 904 మంది మృతి..1,68,912 కేసులు

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ వారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదవ్వగా  904 మంది చనిపోయారు. దీంతో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మొత్తం కోటి 35 లక్షల 27 వేల 717 కు చేరగా..మరణాలు1,70,179 కి చేరాయి. నిన్న ఒక్కరోజు 75,086 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  దేశంలో కోటి 21లక్షల 56 వేల 529 కి చేరింది. ఇంకా 12,01,009 మంది ఆస్పత్రిలో ఉన్నారు.  ఇక దేశంలో కరోనా టీకా వేసుకున్న వారి సంఖ్య 10 కోట్ల 45,లక్షల 28 వేల 565 కు చేరింది.