దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 20,409 మంది వైరస్ బారినపడ్డారు. 22, 697 మంది కరోనా నుంచి కోలుకోగా..లక్షా 43 వేల 988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4, 39,79,730 కి చేరగా..4,33, 09,484 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24గంటల్లో 47మంది మరణించగా..మొత్తం మరణాల సంఖ్య 5,26,258కి చేరింది. రికవరీ రేటు 98.48శాతం ఉండగా..యాక్టివ్ కేసులు 0.33శాతం, మరణాలు 1.20శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 203 కోట్లకుపైగా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు తెలిపింది.
India reports 20,409 new COVID19 cases today; Active caseload at 1,43,988 pic.twitter.com/3YYULK8bZJ
— ANI (@ANI) July 29, 2022