దేశంలో కొత్తగా 2, 827 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 2, 827  కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి 3వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2 వేల 827 కొత్త కొవిడ్ కేసులొచ్చాయి. కొత్త వైరస్ కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 19 వేలకు పడిపోయాయి. ప్రస్తుతం 19 వేల 67 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 3 వేల 230 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. వైరస్ బారిన పడి మరో 24 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 190 కోట్లకు పైగా టీకా పంపిణీ చేసినట్లు తెలిపింది కేంద్రం.