ఆగని మృత్యుఘోష.. ఒకే రోజు 4529 మరణాలు

ఆగని మృత్యుఘోష.. ఒకే రోజు 4529 మరణాలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ఓ వైపు రోజు వారీ కేసుల సంఖ్య కాస్త తగ్గుతున్నా..మరణాల సంఖ్య భయాందోళనకు గురి చేస్తుంది. గత రెండు రోజులుగా దేశంలో రికార్డ్ స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,67,334 కేసులు నమోదవ్వగా 4,529 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 2,54,96,330 కి చేరగా..మరణాల సంఖ్య 2,83,248 కి చేరింది. నిన్న మరో 3,89,851 మంది కోలుకోవడంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య దేశంలో 2,19,86,363 కు చేరాయి.  32,26,719 ఆక్టివ్ కేసులున్నాయి.ఇప్పటి వరకు దేశంలో  18 కోట్ల 58లక్షల 9వేల 302 మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.