ఈ నాలుగు విభాగాల్లో మహిళలను తొక్కేస్తున్నారా..? దిగజారిన భారత్ ర్యాంక్..

ఈ నాలుగు విభాగాల్లో మహిళలను తొక్కేస్తున్నారా..? దిగజారిన భారత్ ర్యాంక్..

Gender Gap Increase: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజాగా గ్లోబల్ జెండర్ గ్యాప్ 2025 పేరుతో ఒక రిపోర్టును విడుదల చేసింది. ఇందులో మెుత్తం 146 దేశాల్లో మహిళలు, పురుషులు సంఖ్య మధ్య ఉన్న అంతరాల గురించి నివేదించబడింది. 

ఇందులో ప్రస్తుతం భారత్ 131వ స్థానంలో నిలిచింది. వాస్తవానికి గత ఏడాది భారత్ 129వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం రెండు స్థానాల కిందికి పడిపోయింది. ఇది దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న అంతరాన్ని సూచిస్తోంది. ఈ రిపోర్టు ఎకనమిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్ వంటి నాలుగు కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయించబడింది. 

ఈ సారి భారత్ ఎకనమిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ అంశంలో మెరుగైన ప్రదశ్ననను కనబరించిందని తేలింది. ఇది మినహా ఇతర అంశాల విషయంలో భారత స్కోర్ పెద్దగా మార్పేమీ లేదని రిపోర్ట్ వెల్లడించింది. జననాల్లో లింగ నిష్పత్తి, ఆరోగ్యకరమైన ఆయుర్దాయంలో మెరుగైన స్కోర్‌ల ద్వారా భారత్ హెల్త్ అండ్ సర్వైవల్ స్కోర్ మెరుగుపడింది. ఇదే క్రమంలో మహిళల రాజకీయాల్లో పార్టిసిపేషన్ 6.5 శాతం నుంచి 5.6 శాతానికి తగ్గినట్లు వెల్లడైంది. 

ఆసియాలోని ఇతర దేశాల ర్యాంకులను పరిశీలిస్తే.. బంగ్లాదేశ్ 24వ స్థానం, భూటాన్ 119వ ర్యాంక్, నేపాల్ 125వ స్థానం, శ్రీలంక 130వ ర్యాంక్, ఇండియా 131వ స్థానం, మాల్దీవులు 138వ స్థానం, పాకిస్థాన్ 148వ స్థానంలో కొనసాగుతున్నాయి.