వ్యాక్సినేషన్ లో అమెరికాను దాటిన భారత్

వ్యాక్సినేషన్ లో అమెరికాను దాటిన భారత్

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో కీలకమైన వాక్సినేషన్ లో భారత్ దూసుకెళ్తోంది. టీకా వేయడంలో తొలి ప్లేస్ లో ఉన్న అగ్రరాజ్యం అమెరికాను అధిగమించింది. తద్వారా వేగవంతంగా వాక్సినేషన్ చేస్తున్న దేశంగా ఇండియా నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వ్యాక్సినేషన్ లో యూఎస్ ను దాటేసి ప్రపంచంలో అత్యంత వేగంగా ముందుకెళ్తున్న దేశం మనదేనని జవదేకర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కరోనా మీద పోరును మరింత వేగవంతం చేద్దామంటూ ట్వీట్ చేశారు.