24 గంటల్లో 48,268 కేసులు..59,454 మంది రికవరీ

24 గంటల్లో 48,268 కేసులు..59,454 మంది రికవరీ

దేశంలో గడిచిన 24 గంటల్లో మరో 48,268 కేసులు నమోదవగా 551 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 81,37,119 కు చేరగా..మరణాలు 1,21,641 కు చేరాయి. నిన్న మరో 59,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 74,32,829 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 5,82,649 మంది  ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా ఆక్టివ్ కేసులు 7.16 శాతం, రికవరీ 91.34 శాతం, డెత్ రేట్ 1.49 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.