మొహాలీ వన్డే : ఆస్ట్రేలియా టార్గెట్ -359

మొహాలీ వన్డే : ఆస్ట్రేలియా టార్గెట్ -359

మొహాలీ : నాలుగో వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా బిగ్ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 రన్స్ చేసింది. ఓపెనర్లు ధావన్(సెంచరీ), రోహిత్ రాణించడంతో ఇండియాకు శుభారంభం దక్కింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, రాహుల్ ఫర్వాలేదనిపించినా..చివర్లో విజయ్ శంకర్ సిక్సర్లతో చెలరేగగా..లాస్ట్ బాల్ కి బుమ్రా సిక్స్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా ముందు బిగ్ టార్గెట్ ఉంచారు.

భారత ప్లేయర్లలో.. ధావన్(143), రోహిత్(95), రిషబ్ పంత్(36), రోకేష్ రాహుల్(26), శంకర్(26)  రన్స్ తో రాణించారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో..కమిన్స్(5), రిచర్డసన్(3), జంపా(1) వికెట్లు తీశారు.