కోహ్లీసేన మరో సిరీస్ పై గురి పెట్టింది. విశాఖ టెస్టులో హిట్ మ్యాన్ వీరవిహారంతో బోణీ కొట్టిన టీమిండియా ఇప్పుడు పూణే టెస్టుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి కప్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. టీ-20 సిరీస్ లో చేసిన పొరపాటు చేయకుండా…. మరో టెస్ట్ కు ముందే…సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది
ఎలాగైనా రెండో టెస్టులో విజయం సాధించాలని సఫారీలు కసిగా ఉన్నారు. మొదటి టీ20 ఓటమిపాలైన క్రమంగా పుంజుకొని రెండో టీ20 సొంతం చేసుకుంది ప్రొటీస్. అలాగే టెస్టు సిరీస్ ను కూడా సమం చేయాలని భావిస్తోంది. అయితే అటు స్పిన్నర్లు, ఇటు సీమర్లు మంచి ఫామ్ లో ఉండడంతో భారత్ బౌలర్లను ఎదుర్కొవడం సఫారీలకు కష్టంగా మారింది. ఇక వైజాగ్ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి ఇరగదీసిన రోహిత్ పైనే ఇప్పుడు అందిరి దృష్టి ఉంది. తొలి టెస్టుతో అతడిపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే రోహిత్ టెస్టుల్లో ఎలా ఆడతాడో అనే దానిపై ఫోకస్ పెట్టడం తగ్గించాలన్నారు టీమిండియా సారథి విరాట్ కోహ్లి.