V6 News

నాగ్ పూర్ వన్డే : ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ

నాగ్ పూర్ వన్డే : ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ

నాగ్ పూర్ : ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 8పరుగులు తేడాతో గెలిచింది టీమిండియా. చివరి ఓవర్లో ఆసీస్ 11 రన్స్ చేయాల్సి ఉండగా.. రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది ఆసీస్. చివరి ఓవర్లో రెండు వికెట్లు తీశాడు విజయ్ శంకర్.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 250 పరుగులు చేసింది. సెంచరీతో అదరగొట్టాడు కోహ్లీ. ఆసీస్ బ్యాట్ మెన్ లో స్టోయినిస్ యాభైరెండు పరుగులు చేయగా, హ్యాండ్ స్కోబ్ 48 పరుగలు చేశారు. కుల్దీప్ యాదవ్ మూడు, బుమ్రా, విజయ్ శంకర్ చేరో రెండు వికెట్లు తీశారు. కేదార్ జాదవ్, జడాజా చేరో వికెట్ తీసుకున్నారు. దీంతో ఐదు వన్డేల సీరిస్‌లో భారత్ 2-0తో లీడ్‌ తో కొనసాగుతుంది.