హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేతక్ హెలికాప్టర్ కీ రోల్ పోషిస్తున్నదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఏండ్లుగా సేవలందిస్తున్న చేతక్.. ఓ మిషన్లా కాకుండా యుద్ధ వీరుడిలా పోరాడుతోందన్నారు. చేతక్ హెలికాప్టర్ 60 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ ఆధ్వర్యంలో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. శామీర్పేటలోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీ(ఎన్ఐఎస్ఏ)లో శనివారం జరిగిన వేడుకల్లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ పాల్గొన్నారు.
భీకర యుద్ధ సమయాల్లో ఎయిర్ఫోర్స్, నేవీలో చేతక్ విశేష సేవలందించిందని రాజ్నాథ్సింగ్ అన్నారు. ఒక హెలికాప్టర్కు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నారంటేనే దాని గొప్పతనమేంటో అర్థమవుతోందన్నారు. చేతక్ చూడ్డానికి చిన్నగా ఉన్నా చేతల్లో భయానక వాతావరణం సృష్టించగలదని చెప్పారు. అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులు చేతక్ను ఆపరేట్ చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎయిర్ఫోర్స్ అధికారులను రాజ్నాథ్సింగ్ అభినందించారు. సూర్యకిరణ్, చేతక్ హెలికాప్టర్స్, యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.