న్యూయార్క్: అమెరికా పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు భారతీయ అమెరికన్లు రెడీ అవుతున్నారు. న్యూయార్క్లోని ప్రసిద్ధ టైమ్ స్క్వేర్ వద్ద ‘ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ’ ఆధ్వర్యంలో మోదీకి స్వాగతం చెబుతూ పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టారు. ఇలానే అమెరికాలోని 20 నగరాల్లో ప్రముఖ స్థలాల్లో చేపట్టనున్నారు. 21న యోగా దినోత్సవ కార్యకమంలో మోదీ పాల్గొననున్నారు. మోదీకి వైట్హౌస్లో 22న అధ్యక్షుడు బైడెన్ దంపతులు గౌరవ విందు ఇవ్వనున్నారు.
మోదీ పర్యటన కోసం యావత్ భారతీయ అమెరికన్ సమాజం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని ఎన్ఆర్ఐ అడపా ప్రసాద్ చెప్పారు. జూన్ 21న మోదీ విమానం దిగే వైమానిక స్థావరం వద్దకు వెళ్లి స్వాగతం చెప్పడానికి భారతీయ అమెరికన్లు సిద్ధమవుతున్నట్లు కృష్ణా రెడ్డి ఏనుగుల, విలాస్ జంబుల తెలిపారు.