
భారతీయ సంప్రదాయంలో బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందువలన బంగారం పట్టీలను కాళ్లకు పెట్టుకోరు. అయితే పాదాలకు వెండి పట్టీలు ధరించడం గౌరవనీయమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది అలంకరణ లో ఒక భాగం మాత్రమే కాదు.. దాని వెనుక అనేక మతపరమైన, శాస్త్రీయ, ఆయుర్వేద కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .
భారతీయ స్త్రీలు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మహిళల కాళ్లకు ధరించే పట్టీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి కేవలం అందానికే కాదు... ఆరోగ్యం కూడా కలుగజేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
హిందూ మహిళలు అందంగా ఉండేందుకు వెండి పట్టీలను ధరిస్తారు. స్త్రీలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా తమ పాదాలకు వెండి పట్టీలను ధరించడం తరచుగా కనిపిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు వెండి పట్టీలను ధరిస్తే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతారు. వీటిని ధరించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సంతోషం వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంకా వెండి పట్టీలను ధరించడం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.
పురాణాల ప్రకారం వెండికి సానుకూల శక్తిని కలిగించడం.. చల్లదనం... శాంతి.. స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. వెండి పట్టీలు ధరించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని.. ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. పట్టీల గలగల అనే మధురమైన శబ్దం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.
ఇక సైంటిఫిక్ గా వెండి పట్టీలు ధరించడం వలన రక్త ప్రసరణను మెరుగుపడి... చీలమండలు దగ్గర పాదాలలోని కొన్ని బిందువులపై ఒత్తిడి పడుతుంది. ఇవి ఆక్యుప్రెషర్ సూత్రంపై పనిచేస్తాయి. పాదాలలో వాపు, నొప్పి మొదలైన సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మహిళల్లో హార్మోన్ల ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. వెండి పట్టీలు ధరించడం వలన హార్మోన్ ల సమతుల్యత ఏర్పడి .. ఇది ఋతు సమస్యలు, ఇతర హార్మోన్ల అసమతుల్యతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడించాయి.
వెండిలో వ్యాధి నిరోధకత శక్తి ఉంటుంది. అందుకే కొన్ని ఆయుర్వేద మందుల్లో వెండిని రసాయనంగా మార్చి కలుపుతారు. ఇంకా ఇందులో యాంటీ బాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. వెండిని పాదాలకు ధరించడం వల్ల శరీరాన్ని అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రత నియంత్రించే లక్షణం వెండి లోహంలో ఉంటుంది. శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది.
జ్యోతిష్యం ప్రకారం చంద్రుడికి, శుక్ర గ్రహానికి వెండి ఆభరణాలకు సంబంధం కూడా ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు, శాంతిని అందిస్తాడు. శుక్రుడు ప్రేమ, అందం, కళ, వైవాహిక ఆనందానికి కారకుడు. వెండి పట్టీలు ధరించడం వల్ల ఈ గ్రహాలు బలపడతాయి. అప్పుడు వివాహ జీవితంలో మాధుర్యం, శ్రేయస్సును తెస్తాయి.
అందువల్ల వెండి పట్టీలు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. అవి భారతీయ సంస్కృతిలో ఒక లోతైన సంప్రదాయంలో భాగం. దీని వెనుక మత విశ్వాసాలు, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఇవి మహిళల అందాన్ని పెంచడమే కాదు.. మహిళలకు ఆరోగ్యం, అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాయి.