
తాష్కెంట్: ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. ఉజ్ చెస్ కప్ మాస్టర్స్ టోర్నీ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఆఖరి రౌండ్లో ప్రజ్ఞా.. నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్పై గెలిచాడు. ఫలితంగా ఐదున్నర పాయింట్లతో నొడిర్బెక్, సిందరోవ్తో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్లో నిలిచాడు. దీంతో ముగ్గురి మధ్య టైబ్రేక్ నిర్వహించారు. ఫస్ట్ టైబ్రేక్కు ముగిసేసరికి తలా రెండేసి పాయింట్లు సాధించారు. రెండో టైబ్రేక్లో నొడిర్బెక్తో గేమ్ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద.. సిందరోవ్ను ఓడించాడు.
మరో గేమ్లో సిందరోవ్ .. నొడిర్బెక్ను ఓడించడంతో ప్రజ్ఞానందకు టైటిల్ ఖరారైంది. అరవింద్ చిదంబరంతో జరిగిన ఆఖరి గేమ్ను అర్జున్ డ్రా చేసుకున్నాడు. టాటా స్టీల్ చెస్ టోర్నీ, గ్రాండ్ చెస్ టూర్ సూపర్ బెట్ క్లాసిక్ విజయాల తర్వాత ప్రజ్ఞానందకు ఈ ఏడాది మూడో టైటిల్ కావడం విశేషం. తాజా విజయంతో ప్రజ్ఞానంద లైవ్ రేటింగ్ (2778.3)లో ఇండియా టాప్ ప్లేయర్గా నిలిచాడు. ఫలితంగా మూడు స్థానాలు ఎగబాకి వరల్డ్ ర్యాంకింగ్స్లో నాలుగో ప్లేస్ను సాధించాడు.