దుబాయ్​లో కేరళ రిటైర్డ్ ప్రొఫెసర్​ మృతి

దుబాయ్​లో కేరళ రిటైర్డ్ ప్రొఫెసర్​ మృతి

షార్జా: లాక్ డౌన్ ఎఫెక్టుతో యూఏఈ లో చిక్కుకున్న ఇండియన్ రిటైర్డ్ ప్రొఫెసర్ హార్ట్ ఎటాక్​తో చనిపోయారు. షార్జాలో ఉంటున్న తన కూతురును చూడటానికి వెళ్లిన కేరళకు చెందిన శ్రీ కుమార్(70) శనివారం తిరిగి రావాల్సి ఉంది. కానీ, లాక్ డౌన్ కారణంగా సాధ్యం కాలేదు. శ్రీకుమార్ కు గురువారం ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్​కు తీసుకెళ్లగా.. ట్రీట్​మెంట్ పొందుతూ శనివారం చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుత సమయంలో ఆయన బాడీని కూడా సొంతూరుకు తీసుకురాలేమని, షార్జాలోనే దహన సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.