నవంబర్ 1 నుంచి మారిన IRCTC రూల్స్.. ఇకపై వారు లోయర్ బెర్త్ బుక్ చేస్కోవచ్చు..

నవంబర్ 1 నుంచి మారిన IRCTC రూల్స్.. ఇకపై వారు లోయర్ బెర్త్ బుక్ చేస్కోవచ్చు..

ప్రయాణీకుల సౌకర్యాన్ని, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వేలు టికెట్ బుకింగ్‌ నియమాల్లో మార్పులు తీసుకొస్తోంది. నవంబర్ 1 నుంచి రైల్వే సంస్థ తీసుకొస్తున్న మార్పు సీనియర్ సిటిజన్లకు ప్రయాణంలో సౌకర్యాన్ని పెంచుతోంది. అలాగే ముందస్తు రిజర్వేషన్ గడువు విషయంలోనూ కీలక మార్పులు వచ్చాయి. 

రైలు ప్రయాణ సమయంలో ప్రయాణీకులు తరచుగా లోయర్ బెర్తుల. తరచుగా సీనియర్ సిటిజన్లు లేదా మహిళలు లోయర్ బెర్తుల కోసం అడుగుతారు. అలాగే ఆన్‌లైన్‌లో బుకింగ్ సమయంలో అప్పర్ లేదా మిడిల్ బెర్తుల కోసం అడుగుతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రైల్వేలు ఇప్పుడు దాని కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థను మెరుగుపరిచాయి. కొత్త వ్యవస్థ కింద.. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీ స్త్రీలకు లోయర్ బెర్తుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వబడనుంది. అయితే ఇది సీటు లభ్యతపై ఆధారపడి ఉంటుంది. బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ అందుబాటులో లేకపోతే తరువాత రైలులో సీటు ఖాళీగా ఉంటే.. TTE అటువంటి ప్రయాణీకులకు దిగువ బెర్త్‌ను కేటాయించవచ్చు.

ఆన్‌లైన్ బుకింగ్‌కు ఒక కొత్త ఆప్షన్: 

లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుక్ చేసుకోండి అనే ఆప్షన్ ఎంచుకుంటే.. రైలులో లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉంటేనే టిక్కెట్లు బుక్ చేయబడతాయి. లేకుంటే బుకింగ్ ప్రాసెస్ అవ్వదు. లోయర్ బెర్త్ లేకుండా ప్రయాణించకూడదనుకునే వారికి ఈ కొత్త ఆప్షన్ ఉపయోగపడుతుంది. 

అలాగే రైలు ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా  రైల్వేలు నిద్రింతే అలాగే కూర్చునే సమయాలకు సంబంధించి స్పష్టమైన నియమాలను తీసుకొచ్చింది. నిద్ర సమయాలను ఇప్పుడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలుగా నిర్ణయించబడింది. ఈ సమయంలో ప్రయాణీకులు తమకు కేటాయించిన బెర్తులపై విశ్రాంతి తీసుకోవచ్చు. పగటిపూట అసౌకర్యాన్ని నివారించడానికి అందరు ప్రయాణీకులు తమ సీట్లపై కేవలం కూర్చోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.

RAC టిక్కెట్లు ఉన్నోళ్ల పరిస్థితి..

పగటిపూట, సైడ్ లోయర్ బెర్త్‌ను RAC ప్రయాణికులు, సైడ్ అప్పర్ బెర్త్‌ను బుక్ చేసుకున్న ప్రయాణికులు పంచుకుంటారు. కానీ రాత్రిపూట మాత్రం లోయర్ బెర్త్‌ను ఆ సీటు టిక్కెట్ కొన్న ప్రయాణీకుడు మాత్రమే ఆక్రమించుకుంటారు.

ముందస్తు రిజర్వేషన్ గడువు మార్పు..

గతంలో రైల్వే టిక్కెట్లను ప్రయాణ తేదీకి 120 రోజుల ముందుగానే బుక్ చేసుకునేందుకు అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాల వ్యవధిని కేవలం 60 రోజులకు తగ్గించారు. ఇది రద్దు సమస్యలను తగ్గిస్తుంది, బుకింగ్ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరిస్తుంది.