జపాన్​తో ఇస్రో మూన్ మిషన్

 జపాన్​తో ఇస్రో మూన్ మిషన్
  • ప్రాజెక్టుకు ‘లూనార్  పోలార్ ఎక్స్ప్లొరేషన్ మిషన్’ గా పేరు

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తర్వాతి మూన్  మిషన్​ను జపాన్​తో కలిసి చేపట్టనుంది. జపాన్  ఏరోస్పేస్  ఎక్స్ ప్లొరేషన్  ఏజెన్సీ (జాక్సా), ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నాయి. దీనికి ‘లూనార్  పోలార్  ఎక్స్ ప్లొరేషన్  మిషన్’(లూపెక్స్) గా పేరుపెట్టారు. మూన్  మిషన్ కు సంబంధించి రోవర్​ను జాక్సా డెవలప్  చేయనుండగా.. ల్యాండర్​ను ఇస్రో అభివృద్ధి చేయనుంది. 

రోవర్​లో ఇస్రో, జాక్సాకు చెందిన పరికరాలు మాత్రమే కాకుండా నాసా, యూరోపియన్  స్పేస్  ఏజెన్సీకి సంబంధించిన ఇన్ స్ట్రుమెంట్లు కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్టు పనులపై జపాన్  నేషనల్  ఆస్ట్రనామికల్  అబ్జర్వేటరీ డైరెక్టర్  జనరల్  సకు సునేత ఈ నెల ఆరంభంలోనే బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శిం చారు. ఇస్రో చైర్మన్  ఎస్.సోమనాథ్​తో మూన్  మిషన్  లూపెక్స్ పై చర్చలు జరిపారని ఇస్రో అధికారులు తెలిపారు. 

చంద్రుడి ధ్రువ ప్రాంతంలో ఒక బేస్ ను ఏర్పాటు చేయడం, నీటి వనరుల జాడను కనుగొనడం లూపెక్స్  ప్రాజెక్టు ఉద్దేశమని జాక్సా తెలిపింది.