అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి

అమెరికాలో  హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే విద్యార్థిపై దాడి జరిగింది. ఫిబ్రవరి 4న  చికాగోలోని కాంప్ బెల్ లోని తన ఇంటికెళ్తుండగా వెస్ట్ రిడ్జ్  హోటల్ సమీపంలో   అతడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. తనపై దాడికి సంబంధి సెల్ప్ వీడియో రిలీజ్ చేశాడు అలీ. తల,ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తం కారుతూ కనిపించింది. నలుగురు వ్యక్తులు  తన  సెల్ ఫోన్ తీసుకుని కొట్టారని చెప్పాడు. హెల్ప్ చేయాలని  విజ్ఞప్తి చేశాడు. ఎవరో ముగ్గురు వ్యక్తులు అతడిని వెంబడించి దాడి చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

 ఇండియానా వెస్లయిన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదివేందుకు అలీ కొన్ని నెలల క్రితమే అక్కడికి వెళ్లాడు.   అలీకి మెరుగైన వైద్య చికిత్స అందించడంలో సాయం చేయాలని  హైదరాబాద్ లంగర్ హౌజ్ లో నివసించే  అతని భార్య సయ్యద్ రుక్వియా ఫాతిమా రజ్వీ విదేశాంగ మంత్రి ఎస్ .జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు. అలీ కుటుంబం, అతని భార్య ,  ముగ్గురు మైనర్ పిల్లలు ఆందోళన చెందుతున్నారు. 

ALSO READ:  ఏడాదిన్నర చిన్నారి చెరువులో పడి మృతి