
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ పహల్గాంలో టెర్రర్ అటాక్ కు పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం భారత ప్రతినిధుల బృందం యునైటెడ్ నేషన్స్ ఉన్నతాధికారులను కలిసింది. ఏప్రిల్ 22 నాటి పహల్గాం ఉగ్రదాడి గురించి వారికి వివరించింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమని లష్కరే తయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించుకున్న విషయాన్ని యూఎన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. టీఆర్ఎఫ్ పాత్రపై తమ పద్ద ఉన్న సమాచారాన్ని వారికి అందించింది. 2022 ఢిల్లీ డిక్లరేషన్లో ఆమోదించిన తీర్మానంపైనా భారత బృందం వారితో చర్చించింది.