భారత్ ప్రతిష్టను తాకట్టు పెట్టారు..అమెరికా కాన్సులేట్ను ముట్టడించిన ఏఐవైఎఫ్

భారత్ ప్రతిష్టను తాకట్టు పెట్టారు..అమెరికా కాన్సులేట్ను  ముట్టడించిన ఏఐవైఎఫ్

హైదరాబాద్:భారత ప్రతిష్టను ప్రధాని మోదీ అమెరికాకు తాకట్టు పెట్టారని హైదరాబాద్​ లోని అమెరికా కాన్సులేట్​ను ముట్టడించారు ఏఐవైఎఫ్ నేతలు.హిమాయత్​నగర్​ ఏఐటీయూసీ భవన నుంచి వినూత్న రీతిలో ట్రంప్​, మోదీ మాస్క్​ లతో అమెరికా కాన్సులేట్​ వరరు ర్యాలీ నిర్వహించారు.  

భారతీయులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ దుర్మార్గపు చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్​ చేశారు. అమెరికా సామ్రాజ్య వాదం నశించాలని ఏఐవైఎఫ్​ నాయకులు డిమాండ్​ చేశారు. దీంతో కాన్సులేట్​ ఆవరణలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐవైఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు నారాయణగూడ పోలీసులు.