
ఇంగ్లాండ్ తో కీలకమైన నాలుగో టెస్టులో ఇండియా ఎలాగైనా విజయం సాధించాల్సిన పరిస్థితి. 1-2తో సిరీస్ లో వెనకపడ్డ టీమిండియా సిరీస్ లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరగనున్న నాలుగో టెస్టులో ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా టీమిండియా సిరీస్ గెలవలేదు. దీంతో బుధవారం (జూలై 23) ప్రారంభం కానున్న డూ ఆర్ డై టెస్టులో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాను ఓల్డ్ ట్రాఫర్డ్ రికార్డ్ భయపెడుతోంది.
89 ఏళ్లుగా ఈ గ్రౌండ్ లో ఒక్క విజయం లేకపోవడమే అందుకు కారణం. ఓల్డ్ ట్రాఫర్డ్ ప్రపంచంలోని పురాతన క్రికెట్ వేదికలలో ఒకటి. 1857లో స్థాపించబడిన ఈ స్టేడియం మొదటిసారిగా 1884లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు ఆతిధ్యమిచ్చింది. ఈ మ్యాచ్ డ్రా అయింది. టీమిండియా విషయానికి వస్తే గత 89 ఏళ్లలో భారత క్రికెట్ జట్టు ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. 1936లో ఓల్డ్ ట్రాఫర్డ్ లో తొలిసారి టీమిండియా టెస్ట్ ఆడింది. ఈ మ్యాచ్ ను డ్రా గా ముగించారు. 1946లో మరోసారి డ్రా చేసుకోగా.. 1952,1959లో వరుసగా రెండు టెస్టులు ఓడిపోయింది. 1971, 1982, 1990లో డ్రా..చేసుకున్న మన జట్టు..1974,2014లో ఓటమి పాలైంది.
ఈ వేదికపై మొత్తం 9 మ్యాచ్ లు ఆడిన టీమిండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవకపోయినా, ఐదు డ్రాలు చేసుకుని, నాలుగు ఓడిపోయింది. వన్డేల్లో మొత్తం 12 మ్యాచ్ ల్లో 6 గెలిచి ఆరు ఓడిపోయింది. ఈ సిరీస్ లో భాగంగా ఎడ్జ్ బాస్టన్ టెస్టులో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే అంతకముందు ఈ గ్రౌండ్ లో ఒక్క విజయం లేదు. మరోసారి టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురైంది. మరి ఈ మ్యాచ్ లో గెలుస్తారో లేదో చూడాలి. మరోవైపు ఇంగ్లాండ్ కు ఓల్డ్ ట్రాఫోర్డ్ లో అద్భుతమైన రికార్డ్ ఉంది. మొత్తం 20 టెస్టుల్లో 14 మ్యాచ్ ల్లో గెలిచి రెండు ఓడిపోయింది. మరో నాలుగు మ్యాచ్ లను డ్రా చేసుకుంది.
Venue Stats👇🏻
— Doordarshan Sports (@ddsportschannel) July 21, 2025
9 matches. 89 years. The wait has been long... but history is calling at Old Trafford! 🇮🇳✨
Can Team India turn the tide and script a famous victory?#TeamIndia #INDvsENG #OldTrafford@BCCI @ICC pic.twitter.com/8lMgGVzOJR