ఇండిగో, ఎయిరిండియా విమానాల దారి మళ్లింపు

ఇండిగో, ఎయిరిండియా విమానాల దారి మళ్లింపు

దట్టమైన పొగమంచు కారణంగా ఛత్తీస్‭గఢ్‭లోని రాయ్‭పూర్‭కు వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. రాయ్ పూర్‭కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని భువనేశ్వర్‭కు మళ్లించగా.. మరో ఎయిరిండియా విమానాన్ని మహారాష్ట్రలోని నాగ్‭పూర్‭కు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఇండిగో ఫైట్‭ను మధ్యాహ్నం 12.37 నిమిషాలకు భువనేశ్వర్‭కు మళ్లించారు. 

ఛండీఘడ్, రాంచీ, రాయ్ పూర్, అగర్తలాల్లో వాతావరణ పరిస్థితులు విమాన సర్వీసులపై ప్రభావం చూపాయి. విమాన కార్యకాలపాలపై ప్రయాణికులు ముందుగానే సమాచారం తెలుసుకుని రావాలని అధికారులు వెల్లడించారు. ముంబై విమానాశ్రయం నుంచి ఉదయం 9.50 గంటలకు బయలుదేరిన ఎయిరిండియా విమానం.. 11.30 గంటలకు రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయానికి రావాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో నాగ్ పూర్‭కు మళ్లించారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ నాగ్‭పూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.