ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 13 మంది మృతి

ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 13 మంది మృతి

లుమాజాంగ్: ఇండోనేసియాలోని మౌంట్ సెమేరు అగ్నిపర్వతం బద్దలైంది. భారీ ఎత్తున పొగ, బూడిద ఆవరించడంతో పరిసర ప్రాంతాలు చీకటిమయమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు13 మంది మృతి చెందారని ఇండోనేసియా నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రతినిధి అబ్దుల్ ముహారీ తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగొచ్చన్నారు. 57 మంది గాయాలపాలయ్యారని వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అగ్నిపర్వతం బద్దలవడంతో భయంతో వేలాది మంది స్థానికులు అక్కడి నుంచి పరుగులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున లావా విస్తరించడంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు అధికారులు. నిర్వాసితుల కోసం లుమాజాంగ్ లో తాత్కాలిక షెల్టర్లు నిర్మిస్తున్నారు.