
ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ బాగానే నడుస్తోంది. కరోనా తర్వాత అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలను మళ్ళీ రిలీజ్ చేస్తూ దర్శకనిర్మాతలు లాభాలు గడిస్తున్నారు అలాగే ఫాన్స్ కూడా ఈ రీరిలీజ్ ట్రెండ్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతపెద్ద హిట్ అయ్యిందో ఆడియన్స్ కి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రాన్ని ఇటీవలే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22వ తారీఖున రీరిలీజ్ చేసారు. దీంతో ఒక్కసారిగా మెగాస్టార్ అభిమానులు థియేటర్లలో ఈలలు వేస్తూ, డ్యాన్స్లు చేస్తూ, వేరే లెవెల్ లో ఎంజాయ్ చేసారు.
ఇక ఇంద్ర సినిమా రీరీలిజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే తెలుగు రాష్ట్రాల్లో ఇంద్ర చిత్రం దాదాపుగా 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలలో దాదాపుగా 75 వేల డాలర్లు కలెక్ట్ చేసింది.
ALSO READ | తరాలు మారినా చెక్కుచెదరని ప్రేక్షకాభిమానం చిరంజీవి సొంతం: సీఎం చంద్రబాబు నాయుడు
కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తెలుగులో ప్రముఖ దర్శకుడు విశిస్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో చిరుకు జోడిగా తమిళ బ్యూటీ త్రిష కృష్ణన్ నటిస్తుండగా యంగ్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఆశీకరంగనాథ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాతలు వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి తదితరులు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.