సోషల్మీడియాలో అభ్యంతకర పోస్టులు పెడ్తున్రు

సోషల్మీడియాలో అభ్యంతకర పోస్టులు పెడ్తున్రు
  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆయన కొడుకు, మరికొందరిపై ఎస్పీకి   ఫిర్యాదు​ చేసిన కామారెడ్డి 
  • మున్సిపల్  మాజీ చైర్​పర్సన్

కామారెడ్డి, వెలుగు: సోషల్  మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, అతని కొడుకు ఇలియాస్, మరి కొందరిపై చర్య తీసుకోవాలని కోరుతూ పీసీసీ జనరల్  సెక్రటరీ గడ్డం చంద్రఖర్​రెడ్డి భార్య, కామారెడ్డి మున్సిపల్​ మాజీ చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ శుక్రవారం ఎస్పీ రాజేశ్​చంద్రను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షబ్బీర్​ అలీ ఎన్ని రోజులు ఆరాచకాలు చేస్తారని ప్రశ్నించారు.

తనపై సోషల్  మీడియాలో అభ్యంతకరంగా ట్రోల్​ చేస్తున్నారని పేర్కొన్నారు. పని చేయరు, చేసే వాళ్లను చేయకుండా టార్గెట్​ చేస్తారని విమర్శించారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి ఏం సలహాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ‘మీ కుటుంబ సభ్యులకు ఏమి సలహాలు ఇస్తున్నారు? ఆడ బిడ్డలపై  సోషల్  మీడియాలో ట్రోల్​ చేయమని సలహాలు ఇస్తున్నారా?’ అని ప్రశ్నించారు. తాను ఎదగడం  ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. షబ్బీర్​ అలీపై క్రమశిక్షణ కమిటీతో పాటు రాహుల్​గాంధీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. షబ్బీర్​ అలీ, అతని కొడుకు ఇలియాస్, అన్న  కొడుకు షేర్  ముక్తార్, పర్వేజ్​పై  ఫిర్యాదు చేశారు.