INDW vs ENGW: 136 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. పట్టు బిగించిన భారత మ‌హిళ‌లు

INDW vs ENGW: 136 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. పట్టు బిగించిన భారత మ‌హిళ‌లు

స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో భారత మ‌హిళ‌ల జ‌ట్టు పట్టు బిగించింది. మొద‌ట తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్ చేసిన టీమిండియా.. అనంతరం క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ తో ఇంగ్లాండ్‌ను 136 పరుగులకే కట్టడి చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 

ఒకానొక సమయంలో 126/4తో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. దీప్తి శర్మ(5 వికెట్లు) చెలరేగడంతో చివరి 6 వికెట్లను 10 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. దీప్తి శ‌ర్మ స్పిన్ కు ఇంగ్లాండ్ మహిళా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. మొత్తంగా 5.3 ఓవర్లు బౌలింగ్ చేసిన దీప్తి 7 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో 59 పరుగులు చేసిన నాట్ స్కివర్ బ్రంట్ టాప్ స్కోరర్.

అనంతరం ఫాలో ఆన్ ఇవ్వని భారత మహిళా జట్టు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. స్మృతి మంధాన(24), షఫాలీ వర్మ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి 350 పరుగుల లీడ్‌లో ఉంది.