బార్డర్‎లో చొరబాటుయత్నం.. పాక్ పౌరుడి కాల్చివేత

బార్డర్‎లో చొరబాటుయత్నం.. పాక్ పౌరుడి కాల్చివేత

అహ్మదాబాద్: భారత్‎లో చొరబాటుకు యత్నించిన పాకిస్తాన్‎కు చెందిన వ్యక్తిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు కాల్చివేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్‎లోని బనస్కాంత్‌‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.

‘‘బార్డర్ ను దాటి ఇండియాలోకి వస్తున్న ఓ పాకిస్తాన్ వ్యక్తిని గుర్తించాం. వెంటనే అప్రమత్తమై అతడిని వెనక్కి వెళ్లాలని హెచ్చరించాం. అయినప్పటికీ, అతడు వినకుండా ముందుకు రావడంతో కాల్పులు జరిపాం. దీంతో అతడు స్పాట్‎లోనే ప్రాణాలు కోల్పోయాడు” అని అధికారులు పేర్కొన్నారు. 

పహల్గాం టెర్రర్ అటాక్ అనంతరం భారత్–పాక్ సరిహద్దులో చొరబాట్లు పెరిగాయి. దీంతో  బార్డర్​లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ నెల ప్రారంభంలోను ఇలాంటి సంఘటనే జరిగింది. పంజాబ్‌‌ ఫిరోజ్‌‌పూర్‌‌ సమీపంలో బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్తానీయుడిని బీఎస్ఎఫ్ బలగాలు కాల్చి వేశాయి.