ఉద్యోగులు గిగ్ ఉద్యోగాలు చేసుకోవడానికి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఆమోదం తెలిపింది. అయితే దానికి ఆయా మేనేజర్ల వద్ద ముందస్తు అనుమతి తీసుకొని చేయొచ్చని స్పష్టం చేసింది. అయితే రెండో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇన్ఫోసిస్కు పోటీగా ఉండరాదని తెలిసింది. తమ కంపెనీ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా ‘గిగ్ వర్క్’లను ఏ విధంగా చేసుకోవచ్చో ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు అంతర్గతంగా వివరించింది.
ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల సిబ్బంది వలసలు కొంతమేర తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు, తమ అభిరుచి మేరకు కొత్త సాంకేతికతలపై పనిచేయాలన్న అభిరుచిని కొనసాగించేందుకు ఇది వీలవుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే ‘గిగ్’ వర్క్ను ఇన్ఫోసిస్ నిర్వచించలేదు. దానిని ‘మూన్లైటింగ్’గానూ పేర్కొనలేదు. ఒక ప్రధాన కంపెనీలో పనిచేస్తూనే ఇంకో ఉద్యోగం చేయడాన్ని మూన్లైటింగ్ అంటారు.