దేశాభివృద్ధిలో మౌలిక సదుపాయాలదే కీ రోల్: సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం

దేశాభివృద్ధిలో మౌలిక సదుపాయాలదే కీ రోల్: సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం

సికింద్రాబాద్​, వెలుగు:  ఏ దేశ అభివృద్ధిలోనైనా మౌలిక సదుపాయాలదే కీ రోల్ అని దక్షిణ మధ్య రైల్వే జనరల్​ మేనేజర్ ​అరుణ్​కుమార్ ​జైన్ ​పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో మౌలాలిలోని ఇండియన్ రైల్వేస్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​లో గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై  రెండ్రోజుల పాటు నిర్వహించిన జాతీయ వర్క్​షాపు  మంగళవారం ముగిసింది.

 చీఫ్​గెస్టుగా హాజరైన జీఎం మాట్లాడుతూ.. ప్రపంచ పోటీతత్వాన్ని సాధించేందుకు సమర్థమైన లాజిస్టిక్స్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ కీలకమని, ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్​తోనే పరిష్కరించే  చాన్స్ ఉందని తెలిపారు. ప్రాజెక్ట్​ల ప్రణాళిక మంజూరుకు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రధానమంత్రి జీఎస్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుసమర్థవంతంగా వినియోగిస్తుందని పేర్కొన్నారు. వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి సుమిత దావ్రా ప్రధానమంత్రి గతిశక్తిపై పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ఇచ్చారు. ఈ సదస్సులో  రైల్వే మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ , ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు