
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జనవరి–-జూన్) ఏడాది లెక్కన 37శాతం తగ్గుతాయని, 3.06 బిలియన్ డాలర్లుగా రికార్డవుతాయని కన్సల్టెన్సీ కంపెనీ జేఎల్ఎల్ అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పెట్టుబడులు 4.89 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా 68శాతంగా, దేశీయ ఇన్వెస్టర్ల వాటా 32శాతంగా ఉంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అనిశ్చితులు వల్ల ఇన్వెస్ట్మెంట్ లావాదేవీలు ఆలస్యమవుతున్నాయి.