
అమర్ నాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమర్ నాథ్ యాత్ర మార్గంలో స్నైపర్ రైఫిల్ ను స్వాధీనం చేసుకుంది ఆర్మీ. స్నైపర్ రైఫిల్ తో మందుపాత్రను స్వాధీనం చేసుకున్న సైన్యం అవి పాకిస్తాన్ ఆర్మీకి చెందినవిగా గుర్తించారు. అమర్ నాథ్ యాత్రను డిస్టర్బ్ చేసేందుకు పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు కచ్చితమైన ఇంటెలిజెన్స్ నివేదికలున్నాయన్నారు చినార్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ K J S ధిల్లాన్. కశ్మీర్ లో శాంతికి భంగం కలగనివ్వబోమన్నారు ధిల్లాన్. వీలైనంత త్వరగా యాత్రను ముగించుకుని తమతమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని యాత్రికులకు సూచించింది జమ్మూకశ్మీర్ ప్రభుత్వం. యాత్ర మధ్యలోనైనా వెళ్లిపోవాలని యాత్రికులు, భక్తులను కోరుతూ అడ్వైజరీ విడుదల చేశారు జమ్మూకశ్మీర్ గవర్నర్.