ఢిల్లీ, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. నేపాల్, బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. మూడు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో అలజడి సృష్టించే కుట్రతో ఉన్నట్లు సమాచారం. ఉగ్ర ముప్పు పొంచి ఉందని… అలర్ట్ గా ఉండాలని మూడు రాష్ట్రాలకు ఐబీ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.
ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో ఏడుగురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం.