హైదరాబాద్, వెలుగు: ఈ విద్యా సంవత్సరం ఫస్టియర్లో చేరిన విద్యార్థులకు సంబంధించిన రికగ్నిషన్ ఫీజును మేనేజ్ మెంట్లు చెల్లించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. దీంతోపాటు గ్రీన్ ఫండ్ కూడా తీసుకోవాలని సూచించారు. రికగ్నిషన్ ఫీజు రూ. 220, గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ప్రైవేటు, ఎయిడెడ్, గురుకులాల ప్రిన్సిపల్స్కు ఆయన లేఖ రాశారు.
ఈ నెల 24 నుంచి 31 వరకు ఇంటర్ బోర్డు ఖాతాలో వాటిని జమ చేయాలని ఆదేశించారు. వెబ్ పోర్టల్ tgbie.cgg.gov.in లోని పేమెంట్ గేట్వేను ఉపయోగించి ఆన్లైన్ లోనే ఈ మొత్తాన్ని బదిలీ చేయాలని సూచించారు. అయితే, గవర్నమెంట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చామని ప్రకటించారు.
