ప్రారంభమైన అఖిలపక్షం నిరసన దీక్ష

ప్రారంభమైన అఖిలపక్షం నిరసన దీక్ష

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర.. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష ప్రారంభమైంది. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీ, జనసేన ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. దీంతో పాటు విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

అఖిలపక్షం నిరసన క్ర లో ఇందిరాపార్క్ దగ్గర భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకే నిరసనకు అనుమతి ఉందుంటున్నారు పోలీసులు.