క్యాన్సర్ వచ్చిందేమోనని భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

క్యాన్సర్ వచ్చిందేమోనని భయంతో ఇంటర్ విద్యార్థి  ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. క్యాన్సర్ వచ్చిందేమోనని భయంతో ఇంటర్ విద్యార్థి ఉరేసుకుని చనిపోయాడు. చింతల్ కు చెందిన శరత్ అనే యువకుడికి.. రెండు రోజుల క్రితం వాంతులు కావటంతో రక్తపు చుక్కలు పడ్డాయి.

Also Read :- బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

దీంతో క్యాన్సర్ వచ్చిందేమోనని భయపడ్డాడు. వైద్య పరీక్షలు చేసుకోకుండానే భయంతో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.