కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకిన ఇంటర్ విద్యార్థి

కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకిన ఇంటర్ విద్యార్థి

నిజామాబాద్‎లో దారుణ ఘటన వెలుగుచూసింది. యాక్సిడెంట్ చేసిన భయంతో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. నగరానికి చెందిన సాయికిరణ్ అనే సెకండియర్ విద్యార్థి కాకతీయ విద్యాసంస్థలలో చదువుతున్నాడు. బైక్‎పై కాలేజీకి వెళ్తూ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేశాడు. ఆ ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. దాంతో భయపడిన సాయికిరణ్.. కాలేజీకి వెళ్లగానే మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకాడు. సాయికిరణ్ తలకు తీవ్ర గాయంకావడంతో.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాసేపటికే మృతిచెందాడు. సాయికిరణ్ డెడ్ బాడీని మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయికిరణ్ కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.