విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్ : మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత

విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్ : మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ధర్నాకు దిగారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని శుక్రవారం 11-30 గంటలకు మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించారు.  ఫలితాల అవకతవకలకు కారణమైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంటర్ బోర్డ్, గ్లోబరీనా తప్పులతోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ.. విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు.

విద్యార్థులు, పలు సంఘాల నేతలు పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరకు చేరుకోవడంతో.. భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. రెండుచోట్ల బారికేడ్లు ఏర్పాటుచేసి తనిఖీలు చేస్తున్నారు. దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.