కమల్ 234 కోసం ఇంట్రెస్టింగ్ కాంబో.. దాదాపు 37 ఏళ్ల తరువాత

కమల్ 234 కోసం ఇంట్రెస్టింగ్ కాంబో..  దాదాపు 37 ఏళ్ల తరువాత

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal haasan) తన 234వ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం(Manirathnam)తో చేస్తున్న విషయం తెలిసిందే.  1987లో వచ్చిన సూపర్ హిట్ నాయకుడు(Nayakudu) తరువాత ఈ కాంబోలో మళ్ళీ రిపీట్ అవలేదు. దాదాపు 37 ఏళ్ల తరువాత వస్తున్న పవర్ ఫుల్ కాంబో కావడంతో ఈ ప్రాజెక్టు పై ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

తాజాగా ఈ ప్రాజెక్టు నుండి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం మరి ఇద్దరు స్టార్ హీరోలను కూడా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట దర్శకుడు మణిరత్నం. ఆ ఇద్దరు మరెవరో కాదు.. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ఎం తమిళ నటుడు జయం రవి. అంతేకాదు.. తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా ఓ యంగ్ హీరో ఈ ప్రాజెక్టు లో యాక్ట్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇక త్వరలోనే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.    

పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తో భారీ విజయాన్ని అందుకున్న మణిరత్నం ఈ కమల్ కోసం మరో పీరియాడికల్ డ్రామాను సెట్ చేశారట. అందులో భాగంగానే హై టెక్నీకల్ వ్యూల్యూస్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ప్రతీ ఇండస్ట్రీ నుండి స్టార్ యాక్టర్స్ ను తీసుకోనున్నారట మేకర్స్. దీంతో ఈ సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు పెరిగిపోయాయి. మరి రిలీజ్ తరువాత ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ కానుందో చూడాలి మరి.