ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంచిన బోర్డు

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంచిన బోర్డు
  • వచ్చే నెల 11 వరకు ఛాన్స్
  • రూ.2వేల ఫైన్​తో మార్చి 16 వరకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చింది. రూ.100 లేట్ ఫీజుతో వచ్చే 12 నుంచి 22 వరకు, రూ.500 లేట్ ఫీజుతో వచ్చే నెల 23 నుంచి మార్చి 2 వరకు, రూ. వెయ్యి లేట్ ఫీజుతో మార్చి 3 నుంచి 9 వరకు, రూ.2వేల లేట్ ఫీజుతో మార్చి 10 నుంచి 16 వరకు చాన్స్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ శనివారం ప్రకటన విడుదల చేశారు. మే 1 నుంచి ఇంటర్ ఫస్టియర్, 2 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

For More News..

కరోనాతో మరణించిన డాక్టర్‌‌‌‌ భార్యకు ఉద్యోగం

దవాఖాన్లకే మస్తు పైసల్.. 18 వేల జీతంలో 4 వేలు ఆస్పత్రికే