
- హాజరైన 500 మందికిపైగా కార్డియాలజీ నిపుణులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ లో ‘అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ’ పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్షాప్ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. యశోద గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. రావు, అంతర్జాతీయ కార్డియాలజిస్టులు కలిసి ప్రోగ్రామ్ను ప్రారంభించారు. 500 మందికి పైగా కార్డియాలజీ వైద్య నిపుణలు పాల్గొన్న ఈ సదస్సులో, కార్డియో-వాస్కులర్ వ్యాధులపై చర్చించారు.
ఈ సందర్భంగా జి.ఎస్. రావు మాట్లాడుతూ.. 1990లో దేశంలో 2.26గా ఉన్న సీవీడీ (కార్డియోవాస్కులర్ డిసీజ్) మరణాలు... 2020లో 4.77 మిలియన్లకు పెరిగాయన్నారు. కరోనరీ హార్ట్ డిసీజ్ రేట్లు గ్రామీణ జనాభాలో 1.6% నుంచి 7.4% వరకు, పట్టణాల్లో 1 శాతం నుంచి 13.2 శాతం వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు.