
న్యూఢిల్లీ: జులై 8 నుంచి న్యూఢిల్లీలో మూడు రోజులపాటు ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్ జరగనుంది. 25 దేశాల నుంచి 5,000 మంది బయ్యర్లు ఇందులో భాగం పంచుకుంటారని అంచనా. గ్లోబల్గా పేరొందిన ఇండస్ట్రీ ప్లేయర్లందరూ వస్తారని ఆశిస్తున్నట్లు టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సోమవారం వెల్లడించింది. వాల్మార్ట్, లెగో సహా 20 గ్లోబల్ సోర్సింగ్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు టాయ్ఫెయిర్లో పాల్గొంటారని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ ఫెయిర్లో మన దేశానికి చెందిన 250 కంటే ఎక్కువ బ్రాండ్లు తమ ప్రొడక్టులను ప్రదర్శనకు పెట్టనున్నాయని, ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఈ ఫెయిర్ జరగనుందని తెలిపింది.
ఈ 14 వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ బీ2బీ ఎక్స్పో 2023 సౌత్ ఏషియాలోనే పెద్దదని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మను గుప్తా చెప్పారు. తమ ప్రొడక్టులను, పనితనాన్ని గ్లోబల్ కంపెనీలకు చూపించుకోవడానికి మన దేశంలోని టాయ్ మాన్యుఫాక్చరర్లకు ఇదొక మంచి అవకాశమవుతుందని పేర్కొన్నారు. ఫలితంగా కొత్త కస్టమర్లు, పార్ట్నర్లను ఆకర్షించడం వారికి వీలవుతుందని చెబుతూ, మార్కెట్ విస్తరణకు, బ్రాండ్ రికగ్నిషన్కు కూడా ఈ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్ సాయపడుతుందని గుప్తా వివరించారు. అంతేకాదని, దేశంలోని టాయ్ మాన్యుఫాక్చరర్లందరూ ఒక చోట కలిసేందుకు ఈ టాయ్ఫెయిర్ అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఇలా కలవడం వల్ల దేశంలోని మాన్యుఫాక్చరర్లు ఒకరితో మరొకరు కలిసి ముందుకు వెళ్లే ఛాన్స్ ఏర్పడుతుందన్నారు. కొలాబరేషన్స్, పార్ట్నర్షిప్స్, జాయింట్ వెంచర్ల వంటి ప్రపోజల్స్ కార్యరూపంలోకి తెచ్చుకోవడానికి ఇలాంటి ఫెయిర్స్ ఉపయోగపడతాయని గుప్తా పేర్కొన్నారు.
కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్కు దారి.....
కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్తోపాటు, ఇన్నొవేషన్స్కు, కొత్త మార్కెట్లు వెతుక్కోవడానికి, డిస్ట్రిబ్యూషన్ ఛానెల్స్ ఏర్పాటుకూ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్ వేదిక అవుతుందని గుప్తా చెప్పారు. మన దేశంలోని టాయ్ ఇండస్ట్రీలో ఇన్నొవేషన్ పెరగడానికి టాయ్ ఫెయిర్ ఒక ప్లాట్ఫామ్ అని వివరించారు. టాయ్ ఇండస్ట్రీలోని కొత్త ట్రెండ్స్, టెక్నాలజీలు, బెస్ట్ ప్రాక్టీసులపై ఇండస్ట్రీ ఎక్స్పర్టులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోవడానికి ఇక్కడ వీలు కలుగుతుందని గుప్తా చెప్పారు. దేశంలోనూ, విదేశాలలోనూ మన టాయ్ ఇండస్ట్రీ ఎంత ముఖ్యమైనదో దీని ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్ టాయ్ మార్కెట్లో పెద్ద ప్లేయర్గా మన దేశం మారడానికి ఇలాంటి ఫెయిర్స్ దోహదపడతాయని లిటిల్ జీనియస్ టాయ్స్ పేరుతో వుడెన్ టాయ్స్ తయారు చేసే కంపెనీ సీఈఓ నరేష్ కుమార్ గౌతమ్ చెప్పారు. తాము ఈ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో భాగం పంచుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు, స్టేక్ హోల్డర్ల సపోర్టు పొందడానికి ఇలాంటి ఫెయిర్స్ఆవశ్యకమని వివరించారు.