
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని టూరిజం మినిస్టర్జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. బుధవారం సెక్రటేరియెట్లో సీఎంను ఆయన కలిశారు. జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఫెస్టివల్ జరగనుంది. సీఎంను కలిసిన వారిలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ నిఖిల ఉన్నారు.