ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్​కు జేఎన్టీయూ రిజిస్ట్రార్

ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్​కు జేఎన్టీయూ రిజిస్ట్రార్

జేఎన్టీయూ, వెలుగు: అమెరికాలో జరగనున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్​కు కూకట్ పల్లి  జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్​కు ఆహ్వానం అందింది. ‘స్మార్ట్ మొబిలిటీ అండ్ వెహికల్ ఎలక్ట్రిఫికేషన్’ అంశంపై  అక్టోబర్10 నుంచి 12 వరకు  అమెరికాలోని ఐఈవోఎం సొసైటీ నిర్వహించే ఇంటర్నేషనల్ సెమినార్​లో మంజూర్ హుస్సేన్ పాల్గొననున్నారు. సెమినార్​లో పేపర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.